Sri Krishna: వశిష్ఠుడు వెన్నతో కృష్ణుడిని చేసి ఆరాధించిన క్షేత్రం.. ఎక్కడుందంటే..?

bharatiyasampradayalu
Lord krishna

శ్రీకృష్ణుడిని అనేక మంది మహర్షులు ఆరాధించారు, ఆయన సేవలో తరిస్తూ, తన నామస్మరణలో, కీర్తనల్లో తేలియాడుతూ ఉన్నారు. అలాంటి మహర్షులకు శ్రీకృష్ణుడు తన అనుగ్రహాన్ని పంచుతూ వచ్చాడు. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమైన విశిష్టమైన క్షేత్రంగా “తిరుక్కణ్ణం గుడి” ప్రసిద్ధిచెందింది. ఈ క్షేత్రాన్ని “కృష్ణారణ్య క్షేత్రం” అనే పేరుతో కూడా పిలుస్తారు.

ఈ పవిత్ర క్షేత్రం తమిళనాడులో నాగపట్నం సమీపంలో వెలుగొందుతోంది. ఇది 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ప్రసిద్ధమైంది. ఇక్కడ వశిష్ఠ మహర్షి వెన్నతో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని రూపొందించి ఆరాధించగా, స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఆయన వశిష్ఠ మహర్షిని ఆలింగనం చేసి తన అనుగ్రహాన్ని కురిపించాడు. ఈ క్షేత్రంలో విశేషమైన ‘చింత చెట్టు’ రాత్రివేళ ఆకులు ముడుచుకుంటుంది. అలాగే, పువ్వులు మాత్రమే వచ్చే ‘పొగడ చెట్టు’ కనిపిస్తుంది.

తిరుమంగై ఆళ్వార్ కీర్తించిన ఈ క్షేత్రంలో స్వామివారు ప్రత్యక్షంగా కొలువై ఉన్నారని నిరూపించే అనేక నిదర్శనాలు ఉన్నాయి. భక్తుల అనుభవాలు ఇక్కడ తరతరాలుగా కథల రూపంలో వినిపిస్తూ ఉంటాయి. ఈ ప్రదేశం భక్తుల కోసం ఆధ్యాత్మిక అనుభూతులను పంచుతూ నిలుస్తోంది.

Share This Article